Home  »  TV News  »  Eto Vellipoyindhi Manasu : కొత్త వ్యక్తితో కలిసి శ్రీలత మాస్టర్ ప్లాన్.. టీవీలో వచ్చింది చూసి వాళ్ళిద్దరు షాక్!

Updated : Jan 21, 2025

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -307 లో... రామలక్ష్మి ఆకలి అంటూ గట్టిగా అరుస్తుంటాడు సీతాకాంత్. అప్పుడే రామలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. బాగుందంటూ సీతాకాంత్ ఫాస్ట్ గా తింటుంటే మెల్లగా తినండి అంటుంది రామలక్ష్మి. మీరు ఎక్కడున్నా రాజే అండి అని పెద్దావిడ అన్న మాటలు గుర్తుచేస్తుంది రామలక్ష్మి. నువ్వు నా పక్కన ఉంటేనే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నన్ను గొప్పగా చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు.

శ్రీలత ఒకతనికి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇన్ని రోజులకి గుర్తుకువచ్చానా అని అతను అనగానే.. నిన్ను మర్చిపోతేనా కదరా గుర్తుకురావడానికి అని శ్రీలత అంటుంది. ఒక సమస్య వచ్చిందంటూ జరిగిందంతా చెప్తుంది. ఇంకా సీతాకాంత్ గాడిని వదిలించుకోలేదా అని అతను అంటాడు. వాడి భార్య మమ్మల్ని టార్చర్ పెడుతుంది దాన్ని వదిలించుకోవాలని శ్రీలత అంటుంది. నేను చూసుకుంటా ముందు ఆ భద్రం గాడి ఫోటో పంపు అని అతను అంటాడు. శ్రీలత పంపిన భద్రం ఫోటో చూసి వీడు నాకూ తెలుసు కానీ వాడికి నేను తెలియదని అతను చెప్పాగానే అయితే పని మరింత సులువుగా అవుతుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత శ్రీలత పదే పదే గుమ్మం వంక చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూస్తున్నారని శ్రీవల్లి అడుగుతుంది. కాసేపటికి రామలక్ష్మి వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది.. ఇదే నా మాస్టర్ ప్లాన్ అని శ్రీలత చెప్తుంది.

రామలక్ష్మి తల స్నానం చేసి రెడీ అవుతుంటే సీతాకాంత్ వచ్చి ఇంకా నీ జుట్టు అరలేదంటూ జుట్టుని తుడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్దావిడ వచ్చి రామలక్ష్మి.. నీ గురించి టీవీలో వస్తుందని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. తీరా చుస్తే.. శ్రీలత వాళ్ళింటికి రామలక్ష్మి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు ఎడిట్ చేసి అందులో వచ్చేలా చేస్తుంది. సీతాకాంత్ పేరుని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తే అందరు ప్లాట్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని మోసం చెయ్యొచ్చని ఎడిట్ చేస్తారు. అది టీవీలో వస్తుంది. దాన్ని చూసి రామలక్ష్మి, సీతాకాంత్ లు షాక్ అవుతారు. శ్రీవల్లి వాళ్ళకి టీవీలో వచ్చేది శ్రీలత చూపిస్తుంది. ఇక ప్రాబ్లమ్ మీది కాదు రామలక్ష్మి, సీతాకాంత్ లది అని సందీప్ వాళ్ళకి చెప్తుంది శ్రీలత. ఆ తర్వాత ఎందుకు అక్కడికి వెళ్ళావంటూ రామలక్ష్మి పై సీతాకాంత్ కోప్పడతాడు. నీ వల్ల ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు మొత్తం పోయేలా ఉందని సీతాకాంత్ అంటాడు. అప్పుడే మాణిక్యం వచ్చి ఆఫీస్ దగ్గరికి జనాలు వచ్చి గొడవ చేస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.